AP: అనంతపురం జిల్లాలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని బండరాళ్లతో దాడి చేయడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. బిందెలకాలనీలో నివసించే నాగరాజు, అతని అల్లుడు గుణ మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నాగరాజుపై గుణ దాడి చేశాడు. దీంతో నాగరాజు అనుచరులు తన అల్లుడిని దారుణంగా కొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.