మకావు ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు చెందిన గాయత్రి-ట్రీసా ద్వయం సెమీఫైనల్ చేరింది. మహిళల డబుల్స్ విభాగంలో యిన్ హ్యు- లిన్ యున్ జంటపై 21-12, 21-17తో క్వార్టర్స్లో విజయం సాధించింది. ప్రత్యర్థి జంటపై తమ విజయాల రికార్డును 2-0కు పెంచుకుంది. ఇక పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ఆరో సీడ్ శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. ఆయనపై హాంకాంగ్కు చెందిన లాంగ్ ఆగ్నస్ గెలిచాడు.