చేపలు తినేటప్పుడు గొంతులో ముల్లు ఇరుక్కుపోవడం సాధారణంగా కనిపించినా, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అన్నం ముద్ద లేదా అరటిపండు వంటి పాతకాలపు చిట్కాలు పెద్ద ముల్లుల విషయంలో మరింత ప్రమాదకరం. ఇవి అన్నవాహికలో లోతుగా గుచ్చుకుని, రక్తనాళాలను దెబ్బతీసి, అంతర్గత రక్తస్రావానికి కారణం కావచ్చు. గొంతులో ముల్లు ఎక్కువసేపు ఉంటే చీము పట్టి, శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని వైద్యులు చెబుతున్నారు.