ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో DCతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఓపెనర్ బట్లర్ 27 బంతుల్లో 52 పరుగులు చేయగా, కెప్టెన్ గిల్ 45 బంతుల్లో 70 రన్స్తో రాణించారు. సుందర్ 55 పరుగులు చేశారు. ముకేశ్ 2 వికెట్లు తీశారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయ లక్ష్యం 211గా నిలిచింది.