కోల్కతాలో ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్లో బాలికపై అత్యాచారం జరిగింది. 14 ఏళ్ల బాలిక బుధవారం తన తల్లిదండ్రులతో కలిసి ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ అమిత్ మల్లిక్ అనే యువకుడు ఆమెతో మాటలు కలిపి ఆసుపత్రిలోని టాయిలెట్ వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు అదే ఆసుపత్రిలో గతంలో వార్డ్ బాయ్ గా పని చేశాడు.