గంజాయి ఇచ్చి బాలికలపై అత్యాచారం!

TG: నిర్మల్ పట్టణంలోని ఓ కాలనీలో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగింది. గంజాయి మత్తు ఇచ్చి పోచంపాడు పార్కుకు తీసుకెళ్లి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితులిద్దరినీ సఖి కేంద్రానికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. కాగా నిందితుల అరెస్ట్ చేయాలని కోరుతూ కాలనీ వాసులు ఆందోళన చేప్టటారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్