మధ్యప్రదేశ్‌లో బంగారు నాణేల వేట.. గ్రామం మొత్తం తవ్వకాలు

మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ సమీపంలో రాజ్‌గఢ్‌ రాజకోట వద్ద లగ్జరీ హోటల్ నిర్మాణ సమయంలో తవ్వకాల్లో బయటపడిన మట్టిలో బంగారు నాణేలు దొరికాయి. వర్షం తర్వాత రోడ్డుపై మట్టి నుంచి నాణేలు బయటపడటంతో, గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు బంగారు నాణేల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఇవి సుమారు 500 ఏళ్ల నాటివని భావిస్తున్నా, నిపుణులు ఇంకా నిర్ధారించలేదు. ఇటీవల కర్నాటకలోని గదగ్‌ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది, అక్కడ ఇంటి పునాదుల తవ్వకాల్లో శతాబ్దాల నాటి బంగారు నిధి బయటపడింది.

సంబంధిత పోస్ట్