తెలంగాణ ప్రభుత్వం అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) కింద ఫీజు, ఇతర ఛార్జీలలో 25% రాయితీని ప్రకటించింది. ఈ రాయితీ మే 1 నుండి జూలై 31 వరకు అమల్లో ఉంటుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. 2024లో INC ప్రభుత్వం ఈ పథకం ద్వారా రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం 50% దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో, ఛార్జీల్లో రాయితీ కల్పించి వాటిని పరిష్కరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.