గుడ్ న్యూస్.. లొంగిపోయిన మావోయిస్టులకు ఉద్యోగాలు

TG: లొంగిపోయిన మావోయిస్టుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పర్యాటక మార్గదర్శకులుగా (టూరిస్ట్ గైడ్స్) నియమించాలని నిర్ణయించింది. ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాలు, కర్రిగుట్టలు వంటి పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయడంలో వారి సేవలను వినియోగించుకోనుంది. 'గిరిదర్శక్' పేరుతో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అటవీ సంపద, స్థానిక పర్యాటక విశేషాలను పర్యాటకులకు వివరించే బాధ్యతను వీరు తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్