తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలుకాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి శిరోముండనం చేస్తామని BRS MLC దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ నిర్వహించి మాట్లాడారు. 'జీవో 33 ద్వారా నీట్లో నాన్ లోకల్ వాళ్ళు కేసులు వేసి తెలంగాణ విద్యార్థులకు రావాల్సిన హక్కులను కాలరాస్తున్నారు. జీవో 33 ద్వారా తెలంగాణ విద్యార్థులు తమ మెడికల్ సీట్లను కోల్పోతున్నారు. ఫ్యూడల్ మనస్తత్వంతో బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోంది' అని విమర్శించారు.