మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తికమ్గఢ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోక్సో చట్టం, BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.