80 ఏళ్ల తర్వాత మిలియన్ల కొద్ది తాత నిధిని కనుగొన్న మనవడు

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోలాండ్‌లో ఆడమ్ గ్లాజెవ్స్కీ తన ఆస్తులను కాపాడుకోవడానికి 1939లో ఇంటి సెల్లార్‌లో వెండి వస్తువులు, ఆభరణాలను పాతిపెట్టారు. యుద్ధానంతరం ఆయన కుమారులు పోలాండ్‌కు తిరిగి రాలేకపోయారు. తర్వాతి తరానికి చేరిన ఈ కథలో, జాన్ గ్లాజెవ్స్కీకి నిధి ఉన్న ప్రదేశం గురించి చెప్పి, గుర్తుల ఆధారంగా ఒక మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఇటీవల ఆ మ్యాప్ లభించడంతో, జాన్ పోలాండ్‌లోని తన పూర్వీకుల భవనానికి చేరుకుని, 91 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌తో పాటు స్థానికుల సహాయంతో తవ్వకాలు చేపట్టారు. 19వ శతాబ్దానికి చెందిన బంగారం, వెండి పాత్రలు బయటపడ్డాయి. ఈ సంపద ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మిలియన్ల డాలర్ల విలువ చేస్తుంది. 80 సంవత్సరాల తర్వాత తన తాత పాతిపెట్టిన నిధిని కనుగొనడంతో జాన్ ఆనందానికి అవధులు లేవు.

సంబంధిత పోస్ట్