యూరోపియన్ దేశమైన సెర్బియా పార్లమెంట్లో ప్రతిపక్షం తీవ్ర గందరగోళం సృష్టించింది. విద్యార్థులకు నిధులు పంచే క్రమంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ప్రతిపక్ష ఎంపీలు పొగ బాంబులు, టీయర్ గ్యాస్ డబ్బాలను విసిరారు. దీంతో పార్లమెంట్ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.