పెళ్లైన వారానికే నవ వధువును చంపేశాడు

పెళ్లైన వారానికే నవ వధువును వరుడు చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకుంది. రాజు పాల్(44) అనే వ్యక్తికి గతంలో రెండు వివాహాలు అయ్యాయి. మే 9న ఆర్తి పాల్(24)ను మూడో వివాహం చేసుకున్నాడు. పెళ్లై వారం రోజులు కావస్తున్నా శారీరక సంబంధానికి భార్య అంగీకరించలేదు. దీంతో ఆర్తిని రాజు తీవ్రంగా కొట్టాడు. పోలీసులు ఆర్తిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించి మరణించిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్