దేశంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు: నటి అదా శర్మ

నటి అదా శర్మ తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ది కేరళ స్టోరీ’ విడుదలైనప్పుడు దేశంలో సగం మంది తనను చంపాలని చూశారని, మిగతా సగం మంది తనను రక్షించారని ఆమె వెల్లడించారు. రిస్క్‌ ఉన్న పాత్రలే తన కెరీర్‌ను మార్చాయని చెప్పారు. ‘1920’, ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’ వంటి చిత్రాలతో తనకు కొత్త గుర్తింపు వచ్చిందన్నారు. భావోద్వేగం, యాక్షన్‌ ఉన్న పాత్రలే ఇష్టమని, అలాంటి పాత్రలు చేసేప్పుడు కుటుంబం ఆందోళన చెందుతుందని అదా శర్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్