TG: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు మాజీ మంత్రి హరీశ్రావు లీగల్ నోటీసులు పంపారు. హరీశ్రావు క్షుద్ర పూజలు నిర్వహించారని మహేశ్ చేసిన వ్యాఖ్యలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేరొంటూ తన న్యాయవాది ద్వారా నోటీసులిచ్చారు. ఈ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని మహేశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావాలు వేస్తామని హరీశ్రావు హెచ్చరించారు.