రోహిత్ తర్వాత కెప్టెన్సీకి అర్హుడు అతనే: అశ్విన్

భారత టెస్ట్ కెప్టెన్సీకి రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో.. తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరనే టాపిక్‎పై టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ R. అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. తన యూట్యూబ్ షో ఆష్‎కి బాత్‎లో అశ్విన్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ తర్వాత జస్ప్రీత్ బుమ్రా భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీకి అర్హుడని అన్నారు. కోహ్లీ, రోహిత్ తప్పుకున్న నేపథ్యంలో జట్టులో సీనియర్‎గా ఉన్న బుమ్రా కెప్టెన్‌గా ఉండాలని అశ్విన్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్