AP: అమెరికా దాడిలో వైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. సురేశ్ మృతితో ఆయన భార్య భార్గవి గుండెలవిసేలా రోదించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘జూన్ 9న నా భర్త సురేశ్తో చివరిసారిగా మాట్లాడాను. త్వరలో ఇంటికి వస్తానని చెప్పారు. పెళ్లిరోజు ఘనంగా జరుపుకుందామన్నారు. కానీ ఇలా శవమై వస్తారని అనుకోలేదు. పిల్లల్ని ఎలా పోషించాలి’ అంటూ తన ఇద్దరు కొడుకులను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.