మహారాష్ట్రను సైతం వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు ఛత్రపతి శంభాజీనగర్లోని ఖుల్తాబాద్ తాలూకాలో కాలువకు వరద పోటెత్తింది. అయితే వరద నీటిలో బైక్తో సహా కాలువ దాటేందుకు ఓ యువకుడు సోమవారం యత్నించాడు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో బైక్తో సహా ఆ యువకుడు కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తూ ఆ యువకుడి ప్రాణాలు నిలిచాయి. గ్రామస్థులు అతికష్టం మీద ఆయనను రక్షించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.