ప్రతి భారతీయ వంటింట్లో లభించే లవంగాలు వంటకాలకే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట నీటిలో నానబెట్టిన రెండు లవంగాలను ఉదయాన్నే తాగడం వల్ల 'యూజినాల్' సమ్మేళనం ద్వారా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. 21 రోజుల పాటు ఈ నీటిని తాగితే జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, దంతాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవాలని సూచించారు.