ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఏబీసీ (యాపిల్, బీట్రూట్, క్యారెట్) జ్యూస్ తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇది శరీరానికి పోషకాలు, శక్తిని అందించి, చర్మాన్ని కాంతివంతం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు. కంటి చూపును మెరుగుపరిచి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని వివరిస్తున్నారు. తయారికి యాపిల్, బీట్రూట్, క్యారెట్, తేనె, పుదీనా అవసరం. ఈ జ్యూస్ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.