దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల వేర్వేరు ఘటనల్లో ఒక వృద్ధుడు, ఓ యువకుడు, నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో రెండు రోజులుగా కురిసిన వానలతో ఢిల్లీలో మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. కాగా, వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.