ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.