ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే. బస్తర్ అడవుల్లో మైనింగ్ ప్రారంభమైందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్థానిక ఆదివాసీ మహిళ ఒక సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. 'నా పక్కన మైనింగ్ జరుగుతుంది. అడవి పచ్చగా ఉంటుంది, కానీ మైనింగ్ మొదలయ్యాక మొత్తం ఎర్రగా అయింది. మా బస్తర్లో ఏమి జరుగుతోందో అస్సలు తెలియడం లేదు. మా పిల్లలకు అడవి లేకుండా చేస్తున్నారు’ అని ఆమె వాపోయారు.