2008లో తొలిసారిగా ఎవరెస్టు దినోత్సవాన్ని ప్రారంభించారు. 2008 మే 29న ఎడ్మండ్ హిల్లరీ మరణించడంతో.. ఆయన జ్ణాపకార్థంగా నేపాల్ అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుతుంది. ముఖ్యంగా, టెన్జింగ్ పుట్టినరోజు కూడా ఈ రోజే కావడం గమనార్హం. నార్గే మరియు హిల్లరీ 1953లో ఆగ్నేయ శిఖరం మార్గాన్ని ఉపయోగించి ఎవరెస్ట్ను మొదటిసారిగా అధిరోహించారు. ఈ రోజున, నేపాల్లోని ఖాట్మండు మరియు ఎవరెస్ట్ ప్రాంతంలో స్మారక కార్యక్రమాలు జరుగుతాయి.