మేఘాలయాలో హానీమూన్కి వెళ్లిన జంట అదృశ్యం కాగా.. భర్త రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితులుగా సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా అరెస్టయ్యారు. విచారణలో వారి వ్యవహారం సంచలనం రేపుతోంది. హత్య తర్వాత రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న కుష్వాహా, సోనమ్ తండ్రిని ఓదార్చడమే కాకుండా కుటుంబానికి విధేయుడిలా ప్రవర్తించాడట. తన విషయం బయట పడకుండా చాకచక్యంగా వ్యవహరించగా.. పోలీసుల దర్యాప్తుతో ఈ విషయం బయటపడింది.