హనీమూన్ వెళ్లి భర్తను హత్య చేయించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హత్య కేసులో వధువు సోనమ్ రఘువంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె తన ప్రియుడు రాజ్, అతని స్నేహితుల సహాయంతో ఈ హత్యకు సూత్రధారిగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. రాజా హత్య తర్వాత, కిడ్నాపర్గా భావించబడిన సోనమ్ ఇండోర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. మరో ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు.