ఘోరం.. మహిళపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్ మధురానగర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ(50)పై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూలీ చేసుకునే మహిళ కొండాపూర్‌లో పని ముగించుకుని సోమవారం రాత్రి ఇంటికి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉతకాలని, డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి ఓ రూమ్‌లో బంధించి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్