తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో శుక్రవారం యువతి దారుణ హత్యకు గురైంది. 25 ఏళ్ల యువతిని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు.. హుటాహుటిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.