క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందని బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్రెడ్డి సహకారం కోరగానే అంగీకరించారని చెప్పారు. దాతల సహకారంతో ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. సేవలను మరింత విస్తరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, డా.నోరి దత్తాత్రేయుడు పాల్గొన్నారు.