ఎర్ర సముద్రం వేదికగా యెమెన్లోని హౌతి రెబల్స్ రెచ్చిపోతున్నారు. తాజాగా గ్రీస్ దేశానికి చెందిన ఎటర్నిటీ నౌకను సముద్రంలో ముంచేశారు. సముద్రంలో వెళ్తున్న నౌకను హౌతి రెబల్స్ బాంబులతో పేల్చేశారు. షిప్లోని కొంతమందిని తమ వద్ద బంధీలుగా ఉన్నారని వారు ప్రకటించారు. మరోవైపు నలుగురు సిబ్బందిని కాపాడామని సముద్ర భద్రతా వర్గాలు తెలిపాయి. పాలస్తీనియులకు మద్దతుగా హౌతి ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు.