TG: హైదరాబాద్ శంకర్ పల్లిలోని NCC కన్స్ట్రక్షన్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 10 మందికి పైగా గాపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.