TG: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న వారి నుంచి 25 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తీసుకున్న డ్రగ్స్ ప్రధానంగా హైడ్రోపోనిక్ పద్ధతిలో ఉత్పత్తి అయినవని తెలిపారు.