దక్షిణ కొరియా రాజధాని సియోల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సియోల్లోని లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో 22 మంది కార్మికులు మృతి చెందగా.. మరో తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసు దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.