ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. దీని ప్రభావంతో సమీప నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 14 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ కమాండర్ లక్ష్యంగా దాడి జరిగినట్లు SMలో వార్తలు వస్తున్నాయి. తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ వాటిని ఖండించింది. పేలుడుతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది.