రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మానవ హక్కుల వేదిక

TG: నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై మానవ హక్కుల వేదిక స్పందించింది. ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్య నేరం మోపి, వారిని సస్పెండ్ చేయాలని హైకోర్టును కోరింది. ఈ ఎన్ కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే కానిస్టేబుల్ కుటుంబానికి సానుభూతి తెలిపింది.

సంబంధిత పోస్ట్