భర్తను ముక్కలుగా నరికిన కేసు.. 'ఆహారం వద్దు, డ్రగ్స్ కావాలి'

UP నేవీ అధికారి హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్‌ మాదక ద్రవ్యాలకు బానిసలైనట్లు తెలుస్తుంది. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రగ్స్ దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని, వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించిందని తెలిపారు. మానసిక స్థితి సరిగా లేదని, తోటి ఖైదీలపై దాడి చేసే అవకాశం ఉండడంతో వేరుగా ఉంచినట్లు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్