భార్యను చంపి భర్త సూసైడ్!

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దిపూర్లో దారుణం చోటుచేసుకుంది. శ్రీశైలం (37) తన భార్య మంజుల (34)ను హత్య చేసి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. వీరి మరణాలకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్