రోకలి బండతో భార్యను చంపి.. గొంతు కోసుకున్న భర్త!

AP: ప్రకాశం (D), మర్రిపూడి (M) రేగలగడ్డ గ్రామంలోదారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను రోకలి బండతో కొట్టి చంపి.. ఆపై తన గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన శనివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ (50), జయమ్మ (45) దంపతులు. గత కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న నారాయణ రోకలి బండతో దాడి చేసి చంపాడు. ఆ తర్వాత తనూ గొంతు కోసుకుని అతను ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్