హైదరాబాద్కు చెందిన రాహుల్ అనే విద్యార్థి బిహార్లోని పట్నా ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల సిలబస్, సెమిస్టర్లో మార్పులు జరిగాయి. దీంతో పరీక్షలో ఫెయిల్ అవుతానన్న భయంతో యువకుడు కాలేజీ ఏడోవ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. ఆత్మహత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.