ఉత్తరాఖండ్లోని అలకనంద నదిలో హైదరాబాద్ యువకుడు గల్లంతయ్యాడు. HYD ప్రాంతానికి చెందిన ఆనంద్ మోహన్ అక్కడి ఎన్ఐటీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో సరదాగా గడిపేందుకు అలకనంద నదీ తీరానికి వెళ్లి, ఎత్తైన ప్రదేశం నుండి నదిలోకి దూకాడు. ఎంతసేపటికీ ఆనంద్ మోహన్ బయటకి రాకపోవడంతో పోలీసులు, కాలేజ్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.