హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన కాచిగూడ రైల్వే స్టేషన్లో కొత్త విద్యుత్ దీపాలంకరణ ప్రారంభం అయింది. న్యూ లైటింగ్ సిస్టమ్ ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. రూ. 2.23 కోట్ల వ్యయంతో ఈ దీపాలంకరణ పూర్తయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సగటున రోజుకు 50,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ను సందర్శిస్తున్నారని ఆయన తెలిపారు.