తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, నూతన చేరికలతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని నూతనంగా చేరిన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.