సోమనాథ్ స్వాభిమాన పర్వ్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని శివాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాథ్ దేవాలయాన్ని రక్షించేందుకు ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకోవడానికే ఈ కార్యక్రమం అని ఆయన తెలిపారు. ఆలయాల చరిత్రను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.