ఉప్పు గూడ శివాజీ నగర్ లో రూ 6. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు వర్కల నాగరాజు శనివారం ప్రారంభించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శివాజీ నగర్ లో రోడ్డు శిథిలం కావడంతో కార్పొరేటర్ ఫహద్ బిన్ అబ్దాద్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారన్నారు.