AICC పిలుపు మేరకు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో శనివారం చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో MGNREGA బచావో కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.