శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని ధూల్పేట్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అర్ధరాత్రి గౌలిగూడ పుత్లీబౌలికి చేరుకుంది. వర్షాన్ని లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. దాదాపు అర కిలోమీటరు మేర సాగిన ఈ యాత్రలో భక్తి ప్రదర్శన కనిపించింది. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.