న్యాయవాది ఖాజా మెయిజుద్దీన్ హత్య కేసు వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. మెయిజుద్దీన్ చంపేందుకు నిందితులు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశారని తెలిపారు. హత్య కేసులో ఆరుగురిని అరెస్టు చేశామని చెప్పారు. హత్యకు పలుసార్లు రెక్కీ నిర్వహించారని, వక్ఫ్ భూముల వివాదాలే లాయర్ మెయిజుద్దీన్ హత్యకు దారితీశాయని తెలిపారు. ఈ హత్యలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు. మెయిజుద్దీన్, నిందితులకు మధ్య ఏళ్లుగా వివాదాలు ఉన్నట్లు తెలిపారు.