కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్ఎన్ నగర్ కాలనీలో వివాహిత సుభాషిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.