శుక్రవారం బేగంబజార్ ఛత్రి చౌరస్తా వద్ద శ్రీరామనవమి శోభాయాత్రలో యువకులు కర్ర విన్యాసాలు ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. ఓ ట్రక్లో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహం ముందు యువకులు ప్రదర్శించిన విన్యాసాలను భక్తులు ఉత్సాహంగా వీక్షించి చప్పట్లతో అభినందించారు.